లోక్‌సభ ఎన్నికల 4వ దశ గెజిట్ విడుదల!

  • నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 చివరి తేదీ
  • ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
  • నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకూ గడువు
  • మే 13న పది రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్
నాలుగవ దశ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్‌లో నాలుగవ దశ ఎన్నికలు జరుగుతాయి. 

ప్రభుత్వ గెజిట్ ప్రకారం, ఈ దశ నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 చివరి తేదీ. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ కాగా, మే 13న 96 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం ఏడు దశల్లో ఈ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తొలి దశలో అత్యధికంగా 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. చివరి దశలో 57 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.

Gazette Notification
Lok Sabha Polls
4th Phase
Election Commission

More Telugu News